Diwali Horoscope 2025: దీపావళి పండుగ తర్వాత ఐదు రాశుల వారికి అదృష్ట యోగం కలగనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పండగ రోజునుంచి వచ్చే ఆరు నెలలపాటు ఈ రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయని వారు వివరిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సోమవారం, అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులా, ధనుస్సుతో సహా ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం లభించనుంది. వీరికి లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడి, కీర్తి, ధనం, సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆ ఐదు రాశుల వివరాలు ఇలా ఉన్నాయి.
తులా రాశి వారికి కెరీర్ పరంగా శుభ అవకాశాలు ఎదురవుతాయి. అలాగే వారు కోరుకున్న విజయాలను సాధించగలుగుతారు.
ధనుస్సు రాశి వారికి గురు గ్రహం అనుకూలిస్తుంది. ఆ ప్రభావంతో ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. దీని ఫలితంగా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. యువత కెరీర్లో కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు ఇది సరైన సమయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. దీంతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయి.
కుంభరాశి వారికి అనుకూల సమయం మొదలవుతోంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి కాలం. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ఇది మంచి సమయం. దీని ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి.
![]() |
Diwali Horoscope 2025 |
వృషభ రాశి వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆర్థికపరంగా ఇది శుభకాలం. వృషభ రాశి శుక్రగ్రహం ఆధిపత్యంలో ఉండటం వల్ల, ఇది ధనవృద్ధికి దోహదపడుతుంది. ఈ కాలంలో ఆర్థిక విజయాలు పొందుతారు. అలాగే చాలా కాలంగా ఉన్న సమస్యలు సైతం తొలగిపోతాయి.
Also Read: దీపావళి రోజు అమ్మవారి కటాక్షం పొందాలంటే పూజ ఎలా చేయాలి?
మిథున రాశి వారికి దీపావళి తర్వాత కొత్త అవకాశాలు దొరకబోతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కెరీర్లో పురోగతి, వ్యాపారంలో లాభాలు లభిస్తాయి. ఆస్తి వృద్ధి అవకాశాలున్నాయి. వ్యాపారం, వాణిజ్య రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇది సరైన సమయం. అంతేకాదు, ఎక్కడైనా చిక్కుకుపోయిన నగదు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి వారికి దీపావళి తర్వాత కొత్త అవకాశాలు దొరకబోతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కెరీర్లో పురోగతి, వ్యాపారంలో లాభాలు లభిస్తాయి. ఆస్తి వృద్ధి అవకాశాలున్నాయి. వ్యాపారం, వాణిజ్య రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇది సరైన సమయం. అంతేకాదు, ఎక్కడైనా చిక్కుకుపోయిన నగదు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి వారికి గురు గ్రహం అనుకూలిస్తుంది. ఆ ప్రభావంతో ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. దీని ఫలితంగా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. యువత కెరీర్లో కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు ఇది సరైన సమయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. దీంతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయి.
కుంభరాశి వారికి అనుకూల సమయం మొదలవుతోంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి కాలం. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ఇది మంచి సమయం. దీని ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి.